అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః !!
మన భారత దేశ ప్రజలందరి ఆయురారోగ్యముల కోసము, ప్రపంచ ప్రజల క్షేమము కోసము మన దేశ ప్రధాని గారి పిలుపు మేరకు మనమందరము ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిముషాల సేపు మనందరి సంఘీ భావమును ప్రకటిస్తూ మన ఇళ్ళల్లో దీపాలు వెలిగిద్దాము. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ, మరే నూనేతోనైనా మన ఇంటి బాల్కనీలలో నిలబడి దీపాలు వెలిగిద్దాము. లేదా, కొవ్వొత్తి అయినా వెలిగించవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసి వెలుగును చూపవచ్చు, లేదా సెల్ ఫోన్ లోని టార్చ్ నైనా ఆన్ చెయ్యవచ్చు. కావలసినది మటుకు, కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదములు లేకుండా మన భారతీయులమందరము ఏకమైయున్నామనీ, ప్రస్తుతము మనలను, మానవులందరినీ బాధిస్తున్న శతృవుపై ధ్వజమెత్తి, విజయాన్ని కాంక్షిస్తున్నామనీ తెలియజెయ్యటమే ! లాక్డౌన లో ఉన్నవారందరికీ మీ కోసం మేమున్నామని తెలియజెయ్యటమే ! మనందరి ఆరోగ్యము కోసము తమ ఆయురారోగ్యములను పణంగా పెట్టి అహరహము కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, పారా మేడికల్ ష్టాఫ్ వారికి, శానిటరీ వర్కర్స్ కి, పోలీసు శాఖ వారికి, నిత్యావసర వస్తువులను సమకూరుస్తున్న వారందరికీ, మనందరి రక్షణ కోసం కృషి చేస్తున్న వారందరి పట్ల, అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయటానికి, మీకు మేమున్నామని చెప్పటానికి, మనందరిలో ఐకమత్యమున్నదని తెలియపరచటానికి మనమందరమూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిముషాల సేపు మన మనస్సుతో దుష్ట త్వము మీద విజయాన్ని సంకల్పించి, దీపాలను వెలిగించి, ఆ సమయంలో మన మన ఇళ్ళల్లో ఉన్న విద్దుద్దీపాలను తొమ్మిది నిముషాల సేపు నిలిపివేద్దాము. ఆ సమయంలో మన ఇళ్ళల్లోని ఫాన్లు, ఏసిలు ఆన్ లోనే ఉండవచ్చును. ఎవరైనా వెట్ గ్రైండర్ లో పప్పు రుబ్బుకుంటుంటే, దానిని ఆన్ లో ఉంచ వచ్చును.
చేయవలసినది ఏమిటంటే, చెడు మీద మంచి విజయం సాధించాలనే సామూహిక సంకల్పంతో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దీపం వెలిగించటం, ఆ తొమ్మిది నిముషాల సేపు మనం వెలిగించిన దీప కాంతులు కనిపించటం కోసము మన ఇళ్ళల్లోని విద్దుద్దీపాలను నిలిపి వెయ్యటము. దీని వలన మనం అనేక ప్రయోజనాలను సాధించగలము.
1. దీప ప్రజ్వలనము దేవతారాధన.
"దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతీ పరాయణం !
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవీ నమో2స్తు తే" !!
మన భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించనిదే ఏ పనీ మొదలు పెట్టము. ఏ పూజకైనా, ఫంక్షన్లకైనా, పుస్తకావిష్కరణ సభలకైనా అన్నింటికీ ముందు దీప ప్రజ్వలనంతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ప్రపంచ దీపం శ్రీ సూర్యనారాయణ స్వామి వెలగటం ప్రారంభమవగానే మనకు పగలు ప్రారంభమై, మనలోని తంద్రత ఎగిరిపోయి, చురుకుదనం, ఉత్సాహం, పని చెయ్యగల సామర్ధ్యం కలుగుతాయి.
పంచాయతన పూజలో దీపము రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడని చెప్తారు. జ్యోతిశ్శాస్త్ర ప్రకారము నేటి ఈ గడ్డు కాలంలో దీప రూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఆయురారోగ్య జ్ఞాన ప్రదాయకము.
2. కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదాదులు ఏవీ లేకుండా, మానవులందరమూ ఒక్కటేనని చాటి చెప్పే మహత్తర అవకాశము మనము ఇలా ఒకే సమయంలో ఒకే సంకల్పంతో వెలుగును, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒకే పని - దీప ప్రజ్వలనము చెయ్యటము. దీప ప్రజ్వలనము పాప హరము. ఇలా దీపాలు వెలిగించటం వలన మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఒక్కసారైనా దీపము వెలిగించనివారు ఇప్పుడు దీపం వెలిగించటం వలన ఆ దోషాన్ని పోగొట్టుకుంటారు. దోషం పోతే శుభం కలుగుతుంది. పాపం పోతే పుణ్యం లభిస్తుంది.
3. దీపాలు వెలిగించే సంప్రదాయం లేనివారైనా భారతీయులందరూ, మానవులందరూ కూడా వెలుగును కాంక్షిస్తారు కదా ! వెలుగు లేకపోతే అంధకారమే ! అది ఎవ్వరమూ కోరము కదా ! కనుక మనకు వెలుగు కావాలి. ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము కావాలని కోరటమే ఈ కొవ్వొత్తి మొదలైన వాటితో వెలుగును చూపించటము.
4. "సంఘే శక్తిః కలౌ యుగే" అన్నారు. కలియుగంలో సమూహికంగా చేసే పనులకు శక్తి ఎక్కువ. సామూహికంగా ఒక్కటై మనమందరమూ సంకల్పిస్తే, నేడు ప్రపంచ మానవులెదుర్కొంటున్న సమస్య రూపు మాసి పోతుంది. ఈ యుద్ధంలో మానవులు విజయము పొందుతాము.
5. ఏ స్వార్ధం చింత లేకుండా ఎవరైతే సర్వ మానవాళి, సర్వ ప్రాణి కోటి శుభాన్ని కోరతారో వారి శుభాన్ని పరమాత్మ కోరతాడు. కనుక మనమందరమూ మానవ జాతి ఈ పెను ముప్పు నుంచి రక్షించ బడాలనీ, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాము. అందరి సుఖంలోనే మన సుఖం ఉన్నదన్న సత్యాన్ని గుర్తిద్దాము.
6. ఒక్క మనిషి సుఖంగా బ్రతకాలంటే ఎంత మంది మానవుల సహాయ సహకారాలు ఉంటే అది సాధ్యపడుతుందో గుర్తించి, అందరి శుభం కోరుకుందాము, మనం సుఖంగా ఉందాము.
తొమ్మిది ననిముషాల సేపు ఎందుకంటే, తొమ్మిది పూర్ణ సంఖ్య కనుక మనకు పూర్ణత్వము సిద్థిస్తుంది, జగన్మాత అవుగ్రహం లభిస్తుంది కనుక !
"ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః"
జై హింద్ జై భరతమాత
మానవ జాతి వర్ధిల్లు గాక!
పరమాత్మనే నమోనమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః !!
మన భారత దేశ ప్రజలందరి ఆయురారోగ్యముల కోసము, ప్రపంచ ప్రజల క్షేమము కోసము మన దేశ ప్రధాని గారి పిలుపు మేరకు మనమందరము ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిముషాల సేపు మనందరి సంఘీ భావమును ప్రకటిస్తూ మన ఇళ్ళల్లో దీపాలు వెలిగిద్దాము. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ, మరే నూనేతోనైనా మన ఇంటి బాల్కనీలలో నిలబడి దీపాలు వెలిగిద్దాము. లేదా, కొవ్వొత్తి అయినా వెలిగించవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసి వెలుగును చూపవచ్చు, లేదా సెల్ ఫోన్ లోని టార్చ్ నైనా ఆన్ చెయ్యవచ్చు. కావలసినది మటుకు, కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదములు లేకుండా మన భారతీయులమందరము ఏకమైయున్నామనీ, ప్రస్తుతము మనలను, మానవులందరినీ బాధిస్తున్న శతృవుపై ధ్వజమెత్తి, విజయాన్ని కాంక్షిస్తున్నామనీ తెలియజెయ్యటమే ! లాక్డౌన లో ఉన్నవారందరికీ మీ కోసం మేమున్నామని తెలియజెయ్యటమే ! మనందరి ఆరోగ్యము కోసము తమ ఆయురారోగ్యములను పణంగా పెట్టి అహరహము కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, పారా మేడికల్ ష్టాఫ్ వారికి, శానిటరీ వర్కర్స్ కి, పోలీసు శాఖ వారికి, నిత్యావసర వస్తువులను సమకూరుస్తున్న వారందరికీ, మనందరి రక్షణ కోసం కృషి చేస్తున్న వారందరి పట్ల, అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయటానికి, మీకు మేమున్నామని చెప్పటానికి, మనందరిలో ఐకమత్యమున్నదని తెలియపరచటానికి మనమందరమూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిముషాల సేపు మన మనస్సుతో దుష్ట త్వము మీద విజయాన్ని సంకల్పించి, దీపాలను వెలిగించి, ఆ సమయంలో మన మన ఇళ్ళల్లో ఉన్న విద్దుద్దీపాలను తొమ్మిది నిముషాల సేపు నిలిపివేద్దాము. ఆ సమయంలో మన ఇళ్ళల్లోని ఫాన్లు, ఏసిలు ఆన్ లోనే ఉండవచ్చును. ఎవరైనా వెట్ గ్రైండర్ లో పప్పు రుబ్బుకుంటుంటే, దానిని ఆన్ లో ఉంచ వచ్చును.
చేయవలసినది ఏమిటంటే, చెడు మీద మంచి విజయం సాధించాలనే సామూహిక సంకల్పంతో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దీపం వెలిగించటం, ఆ తొమ్మిది నిముషాల సేపు మనం వెలిగించిన దీప కాంతులు కనిపించటం కోసము మన ఇళ్ళల్లోని విద్దుద్దీపాలను నిలిపి వెయ్యటము. దీని వలన మనం అనేక ప్రయోజనాలను సాధించగలము.
1. దీప ప్రజ్వలనము దేవతారాధన.
"దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతీ పరాయణం !
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవీ నమో2స్తు తే" !!
మన భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించనిదే ఏ పనీ మొదలు పెట్టము. ఏ పూజకైనా, ఫంక్షన్లకైనా, పుస్తకావిష్కరణ సభలకైనా అన్నింటికీ ముందు దీప ప్రజ్వలనంతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ప్రపంచ దీపం శ్రీ సూర్యనారాయణ స్వామి వెలగటం ప్రారంభమవగానే మనకు పగలు ప్రారంభమై, మనలోని తంద్రత ఎగిరిపోయి, చురుకుదనం, ఉత్సాహం, పని చెయ్యగల సామర్ధ్యం కలుగుతాయి.
పంచాయతన పూజలో దీపము రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడని చెప్తారు. జ్యోతిశ్శాస్త్ర ప్రకారము నేటి ఈ గడ్డు కాలంలో దీప రూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఆయురారోగ్య జ్ఞాన ప్రదాయకము.
2. కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదాదులు ఏవీ లేకుండా, మానవులందరమూ ఒక్కటేనని చాటి చెప్పే మహత్తర అవకాశము మనము ఇలా ఒకే సమయంలో ఒకే సంకల్పంతో వెలుగును, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒకే పని - దీప ప్రజ్వలనము చెయ్యటము. దీప ప్రజ్వలనము పాప హరము. ఇలా దీపాలు వెలిగించటం వలన మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఒక్కసారైనా దీపము వెలిగించనివారు ఇప్పుడు దీపం వెలిగించటం వలన ఆ దోషాన్ని పోగొట్టుకుంటారు. దోషం పోతే శుభం కలుగుతుంది. పాపం పోతే పుణ్యం లభిస్తుంది.
3. దీపాలు వెలిగించే సంప్రదాయం లేనివారైనా భారతీయులందరూ, మానవులందరూ కూడా వెలుగును కాంక్షిస్తారు కదా ! వెలుగు లేకపోతే అంధకారమే ! అది ఎవ్వరమూ కోరము కదా ! కనుక మనకు వెలుగు కావాలి. ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము కావాలని కోరటమే ఈ కొవ్వొత్తి మొదలైన వాటితో వెలుగును చూపించటము.
4. "సంఘే శక్తిః కలౌ యుగే" అన్నారు. కలియుగంలో సమూహికంగా చేసే పనులకు శక్తి ఎక్కువ. సామూహికంగా ఒక్కటై మనమందరమూ సంకల్పిస్తే, నేడు ప్రపంచ మానవులెదుర్కొంటున్న సమస్య రూపు మాసి పోతుంది. ఈ యుద్ధంలో మానవులు విజయము పొందుతాము.
5. ఏ స్వార్ధం చింత లేకుండా ఎవరైతే సర్వ మానవాళి, సర్వ ప్రాణి కోటి శుభాన్ని కోరతారో వారి శుభాన్ని పరమాత్మ కోరతాడు. కనుక మనమందరమూ మానవ జాతి ఈ పెను ముప్పు నుంచి రక్షించ బడాలనీ, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాము. అందరి సుఖంలోనే మన సుఖం ఉన్నదన్న సత్యాన్ని గుర్తిద్దాము.
6. ఒక్క మనిషి సుఖంగా బ్రతకాలంటే ఎంత మంది మానవుల సహాయ సహకారాలు ఉంటే అది సాధ్యపడుతుందో గుర్తించి, అందరి శుభం కోరుకుందాము, మనం సుఖంగా ఉందాము.
తొమ్మిది ననిముషాల సేపు ఎందుకంటే, తొమ్మిది పూర్ణ సంఖ్య కనుక మనకు పూర్ణత్వము సిద్థిస్తుంది, జగన్మాత అవుగ్రహం లభిస్తుంది కనుక !
"ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః"
జై హింద్ జై భరతమాత
మానవ జాతి వర్ధిల్లు గాక!
పరమాత్మనే నమోనమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.